మంచినీళ్ళ బోరు బాగుచేయించిన జనసేన కార్పొరేటర్

గాజువాక నియోజకవర్గం, 64 వ వార్డు యారాడ గ్రామం నాగోతి వెంకటేష్, బాయన పోలయ్య మరియు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, చాలా రోజుల నుండి మంచి నీళ్లు బోరు మూతపడింది. 64 వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డికి తెలియ చేయగా సమస్య తెలిసిన వెంటనే 24 గంటల్లోనే పని పూర్తి చేయించడం జర్గింది. స్థానిక మహిళలు గోవింద్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంట్ అధికార ప్రతినిధి ముసలయ్య, సచివాలయం సిబ్బంది సూర్య, యారాడ జనసైనికులు బంక సాయికుమార్, సత్యాల నగేష్, తోత్తర శ్రీను, బంక హరీష్, బంక వెంకటేష్, మరుపిళ్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు.