జనసేన పార్టీకి, జనసేనాని ఆశయాల పట్ల ఆకర్షితులవుతున్న ప్రజలు: బండారు శ్రీనివాస్

ప్రజల్లో మార్పు మొదలైందని, ఆత్రేయపురం మండలం, పేరవరం గ్రామంలో చేకూరి కృష్ణంరాజు ఆధ్వర్యంలో తలారి రమేష్, అన్ని వర్గాల వారితో, దళిత నాయకులతో కలిసి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి, పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బండారు శ్రీనివాస్.

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, జనసేన పార్టీ ఇన్చార్జి, ప్రముఖ నేత బండారు శ్రీనివాస్ ఆత్రేయపురం మండలంలో పర్యటించారు. రాత్రి పొద్దుపోయినా, జనసేన పార్టీ యొక్క పటిష్టత కొరకు మండల నాయకులు, జనసైనికులుతో కలిసి, ఆత్రేయపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు ఆధ్వర్యంలో పేరవరం గ్రామంలో తలారి రమేష్ తో కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప ప్రపంచ మేధావి అని, మన దేశానికి గొప్పగా రాజ్యాంగాన్ని రచించి, అన్ని వర్గాల వారికి, వెనుకబడిన బడుగు బలహీన వర్గాల వారికి, దళితులకు బంగారు బాటలు వేసిన భారత జాతి ముద్దు బిడ్డ అని, కొనియాడిన్నారు. అనంతరం పేరవరం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆత్రేయపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు, గ్రామ జనసైనికులు, నాయకులతో పార్టీ యొక్క పటిష్టత కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఐకమత్యంతో అంతా కలిసి ముందుకు సాగాలని, జనసేనాని ఆశయాలను, నాయకత్వ పోరాటపటిమను, ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని, ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పలువురు అన్ని వర్గాలకు చెందిన నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.