కోనేటి ఆదిమూలంను మర్యాదపూర్వకంగా కలిసిన జనసైనికులు

సత్యవేడు నియోజకవర్గంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి కోనేటి ఆదిమూలంను మంగళవారం వరదయ్యపాలెం మండలంలో జనసైనికులు కలిసి మా వంతు కృషి చేసి సత్యవేడు నియోజవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని, కచ్చితంగా అన్నివేళలా జనసేన-టిడిపి-బిజెపి అందరం ఏకమై సత్యవేడు నియోజవర్గంలో ఘనవిజయంతో గెలిపించి ఉమ్మడి జిల్లా అభ్యర్థిగా ఎమ్మెల్యేగా చేస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వరదయ్యపాలెం జనసేన ప్రెసిడెంట్ చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ తులసీరామ్, టి.శిరీష ప్రధాన కార్యదర్శి వెంకటేష్, కేశవ, వసంత్, వినోద్ కార్యదర్శి పృథ్వి, పరశురాం, ప్రసాద్ సత్యవేడు నియోజకవర్గ నాయకులు కులశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.