ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి..

  • జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు

నెల్లూరు: కల్లూరుపల్లి కొత్త చెరువు వద్ద గ్రావెల్ తవ్వకానికి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు డిమాండ్ చేశారు. కల్లూరుపల్లి చెరువు వద్ద ఆందోళన చేస్తున్న స్థానికులకు ఆయన శుక్రవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసిపి అనుచరులకు ఇష్టారాజ్యంగా గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. గతంలో గ్రావెల్ గుంటల తవ్వకం వల్ల అనేకమంది ఆ గుంటల్లో పడి మృతి చెందారని దీనిని దృష్టిలో ఉంచుకొని అనుమతులు రద్దు చేయాలని కోరారు.