కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన జనసేన

శృంగవరపుకోట: రోడ్డు ప్రమాదంలో మరణించిన కంటకాపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలిచింది. 5 లక్షల రూపాయలు బీమా సొమ్ము కార్యకర్త కుటుంబానికి అందించారు. కొత్తవలస మండలం కంటకాపల్లి గ్రామానికి చెందిన సేనాపతి గణేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. క్రియాశీలక జనసైనికులందరికీ పార్టీ అధిష్టానం బీమా చేయించింది. ఈ నేపథ్యంలో గణేష్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు బీమా సొమ్ము మంజూరైంది. శనివారం పార్టీ పీఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ ఆ చెక్ ను అందించారు. ఆదివారం ఆ పార్టీ నాయకులు వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కంటకాపల్లి గ్రామస్తులు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త వబ్బిన సత్యనారాయణ, కొత్తవలస మండల అధ్యక్షుడు గొరపల్లి రవికుమార్, నాయకులు సేనాపతి కొండలరావు, మండల ఉపాధ్యక్షులు బోగాది దేవా, అలమండ సురేష్, జిల్లా ప్రచార కమిటీ సభ్యులు మల్లువలస శ్రీను, నాయకులు గాలి అప్పారావు, తూరిబిల్లి విజయ్, సేనాపతి ఫణీంద్ర, అరిగి సన్యాసిరావు, జానీ, గొరపల్లి పోలి నాయుడు, కోట్ని గోవింద, కోట్ని కొండలరావు, తూరిబిల్లి రాము, ఉగ్గిన చిన్నారావు, నాయుడు, నక్క రాము, రుద్ర నాయుడు, జనసైనికులు పాల్గొన్నారు.