చిర్రావూరు సచివాలయం సెక్రటరికి జనసేన గ్రామ కమిటీ సభ్యుల వినతిపత్రం

మంగళగిరి, చిర్రావూరు గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం వద్ద మరుగుదొడ్డి సౌకర్యం లేనందున, జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం (26-03-2022 శనివారం రోజు జరిగిన) గ్రామ సమస్యల పరిష్కారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం ఇంఛార్జి & రాష్ట్ర చేనేత వికాస విభాగం ఛైర్మెన్ చిల్లపల్లి శ్రీనివాస్ నెలరోజుల్లో అధికార పార్టీ వారు ఈ సమస్యని పరిష్కరించకపోతే జనసేన పార్టీ ఈ సమస్యని సొంత విరాళాలతో పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. అందులో భాగంగా గురువారం చిర్రావూరు సచివాలయం సెక్రటరి కి జనసేన గ్రామ కమిటీ సభ్యులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సచివాలయం సెక్రటరీ 15 రోజుల్లో ఈ సమస్యని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.