లుంబూరు సమస్యలపై ఎలక్ట్రికల్ డి.ఈ కి వినతిపత్రమిచ్చిన గర్భాన

పాలకొండ నియోజకవర్గం లుంబూరు గ్రామం బీసీ కాలనీలో ఇళ్లపై విద్యుత్ ప్రవాహం అయ్యే విద్యుత్ లైన్లు ఉండడం వలన స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురై ఈ సమస్య పరిష్కారం కొరకు పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు దృష్టికి తీసుకురాగానే తక్షణమే స్పందించి ఆ గ్రామానికి వెళ్లి అక్కడ సమస్యలు తెలుసుకుని ఆ సమస్య పరిష్కారం కొరకు పాలకొండ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డి.ఈ.ఈ మోహన్ చంద్రశేఖర్ కి లుంబూరు సమస్యలపై వినతిపత్రం అందచేయడం జరిగింది. డి.ఈ.ఈ సానుకూలంగా స్పందిస్తూ సమస్యలు పరిష్కరిస్తామని తెలియచేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భాన సత్తిబాబుతో పాటు పాలకొండ పట్టణ నాయకులు గొర్రెల మన్మధరావు, అనిల్, సాయి, సీతంపేట శ్రీకాంత్, యోగి, వీరఘట్టం మండల నాయుకులు జనసేన జానీ, వెంకటరమణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.