రావడ నాగు ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతిపత్రం

అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామం లో ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఆరు నెలల క్రితం ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకి పట్టాలు ఇవ్వటం జరిగింది. పట్టాలు పంపిణీ కార్యక్రమంలో నెల రోజుల్లో మీకు ఇళ్ల స్థలాలు చూపిస్తామని ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. ఆరు నెలలు గడిచిన లబ్ధిదారులకి స్థలం ఎక్కడ ఉందో చూపించలేదు. సోమవారం పెదపూడి మండలం పెదపూడి గ్రామంలో కలెక్టర్ స్పందన కార్యక్రమంలో లబ్ధిదారులకి స్థలం వెంటనే చూపించాలని అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నియోజకవర్గం సమన్వయకర్త రావడ నాగు ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంచు మూర్తి, గంగ, అడపా వాసు, తిపిరిశెట్టి ఫణీంద్ర రాజు, పుట్టకొండ రాజు, రవి, సతీష్, సింహాసనం పాల్గొన్నారు.