రాజంపేటలో పవనన్న ప్రజాబాట 35వ రోజు

  • ఇంటింటా ప్రచారం చేస్తున్న జనసేన నాయకులు

రాజంపేట: కులమతాలకు అతీతమైన పార్టీ జనసేన పార్టీ అని పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ జనసేన నాయకులు పేర్కొన్నారు. సోమవారం రాజంపేట జనసేన ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు ఇంటింటికి జనసేన కార్యక్రమంలో భాగంగా 35వ రోజు సోమవారం రాజంపేట మండలంలోని మిట్టమీద పల్లె పంచాయతీలో రాజంపేట జనసేన నాయకులు ఇంటింటికి జనసేన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ రూపొందించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. వైసిపి అరాచక పాలన దృష్టిలో పెట్టుకొని రానున్న 2024 ఎన్నికల్లో జనసేనను ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు భాస్కర్ పంతులు, మన్నూరు గోపి తాళ్లపాక శంకరయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన వీర మహిళలు జెడ్డా శిరీష, సునీత, ప్రియాంక, లక్ష్మీదేవి మల్లేశ్వరి, జనసేన నాయకులు, వీరమహిళలు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.