ఉపాధి హామీ బిల్లుల కోసం జనసేన తరపున ఎమ్మార్వోకి వినతిపత్రం

పెనుకొండ, గోరంట్ల మండలంలో గత కొన్ని నెలలుగా ఉపాధిహామీ బిల్లులు అందక కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని జనసేన పార్టీ నాయకులు స్థానిక ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరువు జిల్లాలు అయిన రాయలసీమలో ఉపాధిహామీ పనిద్వారానే చాలామంది పేద ప్రజలు ఆధారపడి పనులు చేస్తున్నారు. అలాంటి పేద వారికి పనులు చేసి నెలలు గడుస్తున్నా వారికి బిల్లులు పడటం లేదు అని కేంద్రం నుంచి వస్తున్న ఈ డబ్బులుని రాష్ట్ర ప్రభుత్వం వారి పథకాల కోసం వాడుతోంది అని కావున ఇప్పటికీ అయిన ప్రభుత్వం స్పందించి వారికి బిల్లులను వేయాలని లేని పక్షంలో ఉపాధిహామీ కూలీలకోసం జనసేన పార్టీ తరపున పోరాటానికి కూడా సిద్ధం అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, మండల నాయకులు వెంకటేష్, సంతోష్, గొల్ల అనిల్ కుమార్, పెనుకొండ నియోజకవర్గ ఐటి కో ఆర్డినేటర్ యోగనంద రెడ్డి, కమ్మవారిపల్లి రాఘవేంద్ర, మల్లికార్జున, నాగేంద్ర, నరేష్, గంగరాజు, శ్రీనివాసులు, రంగనాథం, మూర్తి, బాబావలి, నరేంద్ర, బాలు తదితరులు పాల్గొన్నారు.