శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం 39వ వారం

పిఠాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి జ్యోతుల శ్రీనివాసు జనసేన నాయకులు పిఠాపురం నియోజకవర్గము వారు ఏర్పాటుచేస్తున్న శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం నందు ప్రతి శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతులకు అన్నపానీయ సదుపాయమును కల్పించుచున్నారు. 39వ వారం కూడా శనివారంనాడు 800 మంది రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చి ఔట్ పేషెంట్లకు కలిపి అన్నపానీయం సదుపాయమును కల్పించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు ప్రత్యేకంగా భోజనం చేస్తున్న రైతులను, పశువుల బేరాల మధ్యవర్తులను, వివిధ హాస్పటల్ కి వచ్చి ఔట్ పేషెంట్లను కలిసి భోజనం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?, భోజనం ఏర్పాటులో ఏమయినా లోటు, పాట్లు ఉన్నాయా అనే విషయం నాకు గాని, ఇక్కడ సాయిప్రియసేవాసమితి వాలంటీర్లుకు తెలియజేసినట్లుయితే మీరు ఇచ్చే సలహాలను తప్పక పాటిస్తామని జ్యోతుల శ్రీ‌నివాసు రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లం కిషోర్, గొల్లప్రోలు నగర పంచాయతీకి చెందిన తల్లాం నూకరాజు, దుర్గాడ గ్రామానికి చెందిన మేడిబోయిన హరికృష్ణ, జ్యోతుల నాని, విప్పర్తి శ్రీను తదితరులు ఆహరపానీయ వడ్డనలో తమ సేవలను అందిస్తున్నా శ్రీమతి డోక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రమునకు శ్రమశక్తి ద్వారా సేవలందిస్తున్నారని వారిని ప్రత్యక్షంగా ప్రత్యేకమైన దన్యవాదాలను తెలియజేయుచున్నానని ఇందుమూలంగా జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు.