బి.అర్ అంబేడ్కర్ కి నివాళులర్పించిన బర్మా ఫణి బాబు

నూజివీడు, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బి అర్ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా నూజివీడు నియోజకవర్గం, ఆగిరిపల్లి మండల కేంద్రంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయ బాధ్యులు బర్మా ఫణిబాబు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ పేరు వాడుకుని ఆయన ఆశయాలను తుంగలోకి తొక్కి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని, కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన పేరుతో రాబోయే ఉమ్మడి జనసేన-టీడీపి ప్రభుత్వంలో పేదలకు ఆయన పేరుతో పథకాలకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆగిరిపల్లి మండల ప్రెసిడెంట్ జలసూత్రం పవన్, వైస్ ప్రెసిడెంట్ ముక్కు మహేష్, మండల కమిటీ సభ్యులు ప్రసాద్, కొప్పుల రాజేష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.