వరద ముంపు ప్రాంతాల్లో జనసేన నాయకుల పర్యటన

కోనసీమ జిల్లా, అమలాపురం జనసేన పార్టీ అమలాపురం ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో వరద ముంపు ప్రాంతాలు పర్యటించారు. కోనసీమ అల్లవరం మండలం బెండమూర్లంక గ్రామానికి చెందిన రెబ్బనపల్లిలో పప్పు, కిరాణా సామగ్రి సుమారు నాలుగు వందల కుటుంబాలకు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట, జిల్లా నాయకులు, సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, ఎంపీటిసిలు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.