బాలశౌరిని మర్యాదపూర్వకంగా కలసిన బర్మా ఫణి బాబు
మచిలీపట్నం కూటమి జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాలశౌరిని నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణి బాబు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియచేసారు. ఆ సందర్భంగా ఆయన నూజివీడు జనసేన పార్టీ పరిస్థితులను విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలానే కుటమి అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని తెలిపారు. ఆయనతో పాటు నూజివీడు జనసేన నాయకులు, ఎన్నికల కమిటి సభ్యులు పాశం నాగబాబు, తోట వెంకట్రావు, ఏనుగుల చక్రి, షేక్ ఇమ్రాన్, వీర మహిళలు ధార్మిక మండలి సభ్యురాలు నీట్లా ఉమా మహేశ్వరి, రామీసెట్టి తేజస్విని, జ్యోతిర్మయి పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-03-at-9.22.37-PM-1024x1024.jpeg)