రోగులకు సరైన భోజనం అందించాలి

*ఆసుపత్రిలో అందిస్తున్న భోజనాలను పరిశీలించిన జనసేన పార్టీ జిల్లా నాయకులు

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో రోగులకు సరైన భోజనం అందించాలని జనసేన పార్టీ జిల్లా నాయకులు కోరారు. మంగళవారం పార్వతిపురం మన్యం జిల్లా ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న భోజనాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకులు చందక అనిల్ కుమార్, రెడ్డి కరుణ, వంగల దాలి నాయుడు, బంటు శిరీష్, గంగిరెడ్ల జగదీష్, మానేపల్లి ప్రవీణ్ వంగలపూడి నాని, వీర మహిళలు బోనెల గోవిందమ్మ, పైల లక్ష్మి, ఆగురు మణి తదితరులు మాట్లాడుతూ అనారోగ్యంగా ఉన్నటువంటి రోగులకు పౌష్టికాహారం అందించిన ప్పుడే వారు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందన్నారు. రోగులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాల్సి ఉంది అన్నారు. ఆసుపత్రిలో అందిస్తున్న భోజనాలు సక్రమంగా లేవంటూ తమ దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలో పరిశీలించడం జరిగింద న్నారు. ఉడకని బెండకాయ, తినేందుకు వీలులేని బియ్యంతో వండిన అన్నం తదితరవి తమ పరిశీలనలో కనిపించాయన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తున్న భోజనాలు మెనూ ప్రకారం సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వారు భోజనాలు ఎలా ఉన్నాయనేదానిపై రోగులు, వారి అటెండర్స్ ని ఆడిగి తెలుసుకున్నారు. లేనిపక్షంలో జనసేన పార్టీ తరపున ఆందోళన చేయడం జరుగుతుందని హెచ్చరించారు.