ముమ్మిడివరం నియోజకవర్గంలో పితాని సుడిగాలి పర్యటన

ముమ్మిడివరం: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ శుక్రవారం తాళ్ళరేవు మండలం, జార్జిపేట గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.. అనంతరం ముమ్మిడివరం నగరపంచాయితీ, క్రాపచింతలపూడి గ్రామంలో గొవ్వాల శ్రీను కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఐ.పోలవరం మండలం, పశువుల్లంక గ్రామంలో దంగేటి వెంకట రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.. అదేవిధంగా ఇటీవల బైక్ ఆక్సిడెంట్ లో గాయపడిన జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి తాళ్లూరి ప్రసాద్ ను పరామర్శించారు.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జక్కంశెట్టి బాలకృష్ణ, మాదాల శ్రీధర్, మాదాల మనీష్, కర్నీడి నాని, గెద్దాడ పండు, రాయుడు గోవింద్, దవులూరు శ్రీనివాస్, పెంకి ఏడుకొండలు, కడలి శ్రీనివాస్, గుత్తుల సూర్యనారాయణ, సిరాగం రాజు, మేడిశెట్టి గిరి, పంచగట్ల, సత్యనారాయణ, చోడి శ్రీ రామ్మూర్తి, అబ్బిరెడ్డి సుందరం, అన్నంనీడి గురునాథం తదితరులు పాల్గొన్నారు.