ప్రసాదరావు చిత్రపటానికి నివాళులర్పించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: పి గన్నవరం మండలం, పి గన్నవరం గ్రామానికి చెందిన వాసంశెట్టి ప్రసాదరావు ఇటీవల స్వర్గస్తులయ్యారు. సోమవారం వారి చిత్రపటానికి నివాళులర్పించి, వారి కుమారులు వాసంశెట్టి సాయి కుమార్ ని, వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జక్కంశెట్టి బాలకృష్ణ (పండు), సానబోయిన మల్లికార్జునరావు, చిరిగినీడి వెంకటేశ్వరరావు, పితాని రామకృష్ణ, తాటికాయల శ్రీనివాసరావు మొదలగు వారు పాల్గొన్నారు.