నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీలో చేరికలు

  • నూతన సంవత్సరం సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, యర్రంశెట్టి రాము, బండారు రాజు, ముమ్మలనేని సునీల్ కుమార్ ల సమక్షంలో పలువురు జనసేన పార్టీలో చేరిక

నూజివీడు నియోజకవర్గం: నూజివీడు టౌన్: నూజివీడు జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో పార్టీ సిద్దాంతాలు నచ్చి నామాల జగదీష్, షేక్ షబ్బీర్, వారి మిత్రులు, బంధువులు పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు. వీరికి ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, యర్రంశెట్టి రాము, బండారు రాజు, ముమ్మలనేని సునీల్ కుమార్ లు పార్టీ కండువా కప్పి పార్టీ లోకి స్వాగతం పలికారు. ఈ సంధర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ పేదల గొంతుక అని, ఎక్కడ ఏ సమస్య ఉన్న ముందుగా స్పందించేది జనసేన పార్టీ అని అన్నారు. నియోజకవర్గములో ఏ సమస్యలు ఉన్నా నేను ముందు ఉండి పోరాడుతాను అని అందరిలా మాటలు చెప్పి షో చెయ్యడం నాకు రాదు అని, ప్రజా సమస్యలపై నా గొంతుక ఎప్పుడు వినిపించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నూజివీడు మండల అధ్యక్షుడు యర్రంశెట్టి రాము, మండల కార్యదర్శిలు చేరుకుపల్లి కిషోర్, షేక్ నాగూర్, టౌన్ నాయకులు బండారు రాజు, ముమ్మలనేని సునీల్ కుమార్, తాళం చెన్న, భాజి, గోపి, అన్వర్, షేక్ షబ్బీర్, నామాల జగదీష్, ముసునూరు మండల కార్యదర్శి మల్లిఖార్జున్, వీరమహిళలు రామిశేట్టి తేజస్విని, రంగు ధనలక్ష్మి, చంద్ర, రావిచెర్ల గ్రామ జనసైనికులు కొన్నంగుంట రాంబాబు, తోట అంజీబాబు, తోట బలరాం, కస్తూరి. అశోక్, శ్రీకాంత్, బాలాజీ, అభి పలువురు జనసైనికులు పాల్గొన్నారు.