కుండలేశ్వరస్వామి వారిని దర్శించుకున్న పితాని బాలకృష్ణ

జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ మహాశివరాత్రి సందర్బంగా శనివారం కాట్రేనికోన మండలం, కుండలేశ్వరంలో వేంచేసి ఉన్న పార్వతి కుండలేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.. ఈ సందర్భంగా కుండలేశ్వరం జనసైనికులు ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి భక్తులకు అందచేశారు. అదేవిధంగా కొప్పిగుంట గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు కోదండ రామ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శెట్టిబలిజ సంఘ పెద్దలు పితానిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో అక్కల లక్ష్మణ్, గంగుమల్ల రవి, చిక్కాల నాగేంద్ర, జక్కంశెట్టి పండు, మోకా బాల ప్రసాద్, మట్టపర్తి శంకర్, గోలకోటి ఫణి, పితాని రాజు, మిమ్మితి చిరంజీవి, భీమల సూరి, విళ్ళ శివ, మాదాల శ్రీధర్, గిడ్డి రత్నశ్రీ, కొప్పిశెట్టి రాజు, బొక్క రాంబాబు తదితరులు పాల్గొన్నారు.