అగ్నిప్రమాద బాధితురాలికి ఆర్ధికసాయమందించి మనోధైర్యాన్నిచ్చిన పితాని

ముమ్మిడివరం, నగర పంచాయతీ 15వ వార్డు క్రాపచింతలపూడి గ్రామంలో పోలిశెట్టి వీరవేణి తాటాకు ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి ఇల్లు పూర్తిగా దగ్ధమై సర్వం కోల్పోయి రోడ్డున పడిన కుటుంబాన్ని సోమవారం జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించి బాధిత కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. అనంతరం ముమ్మిడివరం మండలం ఠానేలంకలో జనసేన పార్టీ కార్యకర్త జనిపెల్ల సుభాష్ కి అమ్మాయి పుట్టినందున కుమార్తెను ఆశీర్వదించడం జరిగింది. మరియు మోకాలు విరిగి బాధపడుతున్న అదే గ్రామానికి చెందిన వాకపల్లి శ్రీనివాసరావుని పరామర్శించి 2000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జునరావు, గోదశి పుండరీష్, జక్కంశెట్టి పండు, మాదాల బుజ్జి, మాదాల శ్రీధర్, గణేశుల శ్రీను, నాతి నాగేశ్వరరావు, పెట్టా సత్తిబాబు, సలాది శ్రీరామ్, చిక్కం సత్యనారాయణ, మాదాల మనీష్, బొబ్బిలి శివాజీ, పాయసం సాయి, బొబ్బిలి నందు, కూనపరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.