డిజిటల్ క్యాంపెయిన్ లో పిఠాపురం జనసేన

జనసేన పార్టీ ఇన్చార్జి మాకినీడి శేషుకుమారి ఆదేశానుసారం..!!
భారీ ట్వీట్స్ మోత మోగిస్తున్న పిఠాపురం జనసైనికులు…..!!!

తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండల పరిధిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ డిజిటల్ క్యాంపెయిన్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీలపై ఒత్తిడి తీసుకురావడానికి జనసేన చేపట్టిన కార్యక్రమం మూడవ రోజుకి చేరింది. ఈ మేరకు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి మాకినీడి శేషుకుమారి ఆదేశానుసారం పిఠాపురం రూరల్ మండల అధ్యక్షురాలు శ్రీమతి తోలేటి శిరీష వారి ఆధ్వర్యంలో చిత్రాడ, కుమారపురం, కందరాడ, ఎఫ్.కె పాలెం, జల్లూరు, మల్లాం, విరవ, మంగితుర్తి, కోలంక, విరవాడ గ్రామాల్లో సోమవారం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం రూరల్ మండలం అధ్యక్షురాలు శ్రీమతి తోలేటి శిరీష, జల్లూరు జనసేన నాయకులు వెన్నా జగదీష్, కందరాడ జనసేన ఎంపిటిసి పిల్లా సునీత, చిత్రాడ జనసేన ఎంపిటిసి దూలపల్లి రత్నం, కోలంక ఎంపిటిసి అభ్యర్థి కేతినిడి గౌరీ నాగలక్ష్మి, పిఠాపురం రూరల్ మండల కమిటీ సభ్యులు, చిత్రాడ, కుమారపురం, కందరాడ, ఎఫ్‌.కె పాలెం, జల్లూరు, మల్లాం, విరవ, మంగితుర్తి, కోలంక, విరవాడ జనసైనికులు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శిలు, జనసేన ఎంపిటిసి అభ్యర్థులు, జనసేన నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.