నూతన సంవత్సరంలో పిఠాపురం వైసిపి కోట బద్దలు

మాకినీడి శేషు కుమారి ఆధ్వర్యంలో మత్స్యకార నాయకుల భారీ చేరికలు

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి సమక్షంలో పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయంలో యూ.కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామ మత్స్యకార నాయకులు వంక కొండబాబు వారి అనుచరులు వైసిపి నుండి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఆయనతో పాటు వై.ఎస్.ఆర్.సి.పి పార్టీ కార్యకర్తలు కూడా జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ శేషుకుమారి మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి వచ్చామని అప్పుడు ఉన్న పరిస్థితి వైసిపి పరిపాలన ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని మత్స్యకారులకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేరలేదని అధికారంలోకి రాకముందు ఎన్నో చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. అలాగే వైసీపీకి నా ప్రశ్న సినిమా టికెట్లు తగ్గిస్తారని కాదు మిమ్మల్ని సీఎంగా చేసింది, ప్రజల కష్టాలు, పడుతున్న ఇబ్బందులు పట్టించుకోండి ప్రజల్ని మోసం చేయకండి ప్రజలందరూ గమనిస్తున్నారు త్వరలో మీకు అడ్డుగోడ వేస్తారని అలాగే మత్స్యకార సోదరులు జాయిన్ అవడం మంచి శుభ పరిణామమని పార్టీకి మరిన్ని సేవలు అందిస్తారని పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లి ఈ విధంగా పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో యు.కొత్తపల్లి మండలం అధ్యక్షులు పట్టా శివ, జిల్లా సంయుక్త కార్యదర్శి చీకట్ల శ్యామ్ కుమార్, దొడ్డి దుర్గాప్రసాద్, సూరడా శ్రీను, స్వామిరెడ్డి అంజి బాబు, వంకా కొండబాబు, మెరుగు ఇశ్రాయేలు, బొందు ప్రసాదు, చింతకాయల పూరి జగన్నాథం, సోది రాంబాబు, బడే మెసేజ్ను, సోదే శ్రీను, కోడా బాలు, రాసిపల్లి శివ, మైలపిల్లి రాజు, మత్స్యకార నాయకులు జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.