ఇఫ్తార్ విందులో పాల్గొన్న పోలవరం జనసేన

పోలవరం, టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో మండల అధ్యక్షులు అడప నాగరాజు, రవి, సుభాని, వలి ఆధ్వర్యంలో రంజాన్ పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. హిందూ, ముస్లిం ఐక్యత భావంతో కలిసిమెలిసి ఉండాలని అన్ని మతాలు సమానం అనేది జనసేన సిద్ధాంతం అని తెలుపుతూ జనసేన నాయకులు పోలవరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ చిర్రి బాలరాజు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, జనసైనికులు, కార్యకర్తలు ముస్లిం సోదరులకు, మహిళలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. చిర్రి బాలరాజు ముస్లిం పెద్దలతో మాట్లాడి రంజాన్ పండగ యొక్క గొప్పదనం గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమనికి వచ్చి అందరితో కలిసి విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. చిర్రి బాలరాజు మరియు గడ్డమనుగు రవి విందులో వడ్డన చెయ్యడం సంతోషంగా ఉందని ముస్లిం పెద్దలు ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో మస్జీద్ ప్రెసిడెంట్ షేక్ అజ్కార్, షేక్ హిమాం, షేక్ షిలర్, షేక్ హుస్సేన్, షేక్ సుభాని, షేక్ షరీఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు.