డొక్కా సీతమ్మ చలివేంద్రం ప్రారంభించిన పోలవరం జనసేన

పోలవరం, కొయ్యలగూడెం మండలం, బయ్యాన్నగూడెం గ్రామంలో జాతీయ రహదారిలో జనసేన నాయకులు మద్దు తేజ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ చలివేంద్రంను పోలవరం నియోజకవర్గం జనసేన ఇంచార్జి చిర్రి బాలరాజు మరియు మద్దు బాల నాగేశ్వరావు ప్రారంభించడం జరిగింది. ఈ వేసవికాలంలో చాలామంది దూరప్రయాణాలు చేసేవారు అలాగే ఉద్యోగస్థులు పనిచేసుకునే వారు ఎంతో మందికి ఈ డొక్కా సీతమ్మ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చలివేంద్రం ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. రహదారిలో ప్రయాణించే ప్రతి ఒక్కరు ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలన్నారు. పెరుగుతున్న ఎండలకు మధ్యాహ్నం సమయంలో బయటకు రాకపోవడం మంచిదని, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి అని చిర్రి బాలరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు నులకాని శ్రీను, యువత అధ్యక్షులు చిన్నం మహేష్, సింగంశెట్టి శ్రీను, నరాల శ్రీను వేండ్రపాటి వెంకట్, లింగాల నవీన్ జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.