అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలిచిన పొందూరు జనసేన

ఆమదాలవలస, ఎక్కడ సమస్య ఉందో.. అక్కడ జనసేన ఉంటుంది. ఇటీవల పొందూరు మండలం నరసాపురం గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు కుటుంబాలు రోడ్డున పడిపోయాయి. వారికి అండగా నిలిచిన పొందూరు మండలం జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసి 15,000/- రూపాయల నగదు మరియు నిత్యావసర సరుకులు, 25 కేజీలు రైస్ ప్యాకెట్టు బుధవారం సాయంత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది. బాధితులకు అండగా నిలిచి సహాయం చేసిన ప్రతి ఒక్క జనసైనికుడికి పొందూరు మండలం జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *