దెందులూరు నియోజకవర్గంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది డిజిటల్ క్యాంపెయిన్

దెందులూరు నియోజకవర్గం: జనసేన పార్టీ మరియు తెలుగు దేశం పార్టీ (టీడీపీ)ల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీతో సమావేశాల నిర్వహణ, సంప్రదింపుల సమన్వయ బాధ్యులు డా. ఘంటసాల వెంకట లక్ష్మీ మరియు దెందులూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో అధ్వాన్నంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిని, ఈ రోడ్ల వలన ప్రజలు పడుతున్న అనేక ఇబ్బందులని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో “గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది” అనే కార్యక్రమం శనివారం దెందులూరు నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ముత్యాల రాజేష్, పార్టీ జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ ఉప్పు కల్కి రమేష్, పార్టీ పెదపాడు మండల నాయకులు కోటగిరి వెంకట సుధాకర్, పల్నాటి సాగర్, పెదవేగి మండల నాయకులు పసుపులేటి భార్గవ్, మేడిచెర్ల కృష్ణ, జిజ్జువరపు సురేష్, పెద్దిశెట్టి గంగరాజు, కొత్త మధుసూదనరావు, పార్టీ ఏలూరు మండల నాయకులు కిషోర్, దెందులూరు మండల నాయకులు చదరం విద్యా సాయి, వీరమహిళ నాయకురాలు బలే నాగ లక్ష్మి జనసైనికులు చింతాడ బబ్లూ, సాయి, శివ నాగరాజు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.