రాయచోటి జనసేన కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

రాయచోటి: రాయచోటినియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ షేక్ హసన్ భాష అధ్యక్షతన, షేక్ రియాజ్ నేతృత్వంలో అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నియోజకవర్గ కార్యాలయంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి జయంతి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా… జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 122వ జయంతి సందర్భంగా మా పార్టీ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జనసేన పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగిందని, తెలుగు ప్రజల కోసం తెలుగు రాష్ట్రాల కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన కృషి మరవలేనిదని, ఆయన త్యాగానికి ప్రతిరూపం మన ఆంధ్ర రాష్ట్రమని, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సభ ప్రాంగణానికి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరు నామకరణం చేయడం జరిగిందని, పొట్టి శ్రీరాములు గారి పోరాట స్ఫూర్తితో మనం కూడా కలిసికట్టుగా కృషి చేసి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి వచ్చే దిశగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేవిధంగా కృషి చేయాలని ఆ ప్రయాణంలో కులమతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు, బేదాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల సభ్యుడు షేక్ రియాజ్, సుదర్శన్, నిజాం, మహబూబ్ భాష, నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.