టిడిపి రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన ప్రమీలా ఓరుగంటి

వెంకటగిరి: మర్రిపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా చేపట్టిన రిలే నిరాహార దీక్షకు వెంకటగిరి ఎమ్మెల్యే మాజీమంత్రి వర్యులు ఆనం రామనారాయణరెడ్డి అధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఆరికట్ల జనార్ధన్ నాయుడు ఆహ్వానం మేరకు సంఘీభావంగా పాల్గోనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు ప్రమీల ఓరుగంటి, మండల కార్యదర్శులు పెనుమాది నరసింహ, బిల్లిపాటి మధు, కృష్ణ, చిన్నా జనసేన ప్రశాంత్, రవి కళ్యాణ్, ఆనంద్, జనసేన మండల నాయకులు పాల్గొన్నారు.