ఆహారశుద్ధి పరిశ్రమలకు ప్రాధాన్యత:

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆహార శుద్ధి పరిశ్రమ అభివృద్ధి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురువారం సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఫుడ్‌ ప్రాసెస్సింగ్‌ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, కేపీఎంజీ కన్సల్టెంట్స్‌లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ ఉపాధితో పాటు గ్రామీణ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలు చేశారని, ఉపాధి అవకాశాలు పెంచుతూ, ఆహార ఉత్పత్తులకు అదనపు విలువలు చేకూర్చేలా కొత్త విధానాలను రూపొందించాలని అధికారులను కోరారు.

ఆహార శుద్ది పరిశ్రమల అభివృద్ది, విధాన రూపకల్పన, అమలు, ప్రోత్సాహకాలపై ప్రభుత్వ పనితీరును మంత్రి అధికారులకు వివరించారు. ఆహారశుద్ధి అభివృద్ధికి క్లస్టర్ విధానం ఏర్పాటు చేయాలని సీఎం జగన్  అభిప్రాయమని మంత్రి అధికారులకు తెలిపారు. ఫుడ్ ప్రాసెసిoగ్ పాలసీ తయారీలో నాబార్డు వారి విధానాలు దృష్టిలో పెట్టుకుని రూపొందించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి సమగ్ర చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక ఆహారశుద్ధి ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని తెలిపారు. అందుకు తగిన విధివిధానాలు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *