క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విజేతలకు బహుమతులు బహుకరించిన బత్తుల

రాజానగరం: రాజమండ్రిలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చర్చ్ పేట గ్రౌండ్ లో, చర్చ్ పేట యూత్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విజేతలకు ట్రోపీతో పాటు, 17 వేల రూపాయల నగదును రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ అందజేశారు. ఈ సందర్బంగా బలరామకృష్ణ మాట్లాడుతూ క్రీడల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఇలా కొంత ఆర్థిక సహాయం క్రీడాకారులకు అందించడం జరిగిందన్నారు.. ఈ ఫైనల్ కార్యక్రమంలో జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి శివరాం, సీనియర్ నేత అడ్డాల శ్రీను, ఆవాల గాంధీ, డాన్ శ్రీను, ఇతర నాయకులు, ప్లేయర్స్, ప్రేక్షకులు పాల్గొన్నారు.