సమస్యలు తప్పనిసరిగా పరిష్కరిస్తా: దేవ

రాజోలు, జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీలు బలపరిచిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీదేవ వరప్రసాద్ మరియు అమలాపురం పార్లమెంటరీ ఎంపి అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉయ్యూరి వారి మెరక గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి చేనేత వస్త్రాలయ సమస్యలు రాజోలు నియోజకవర్గంలో సుమారు 6000 మంది చేనేత కార్మికులు ఉన్నారు. ఒక్క మోరిలోనే 900 చేతితో నెసే మగ్గాలు ఉన్నాయి. మనం తమిళనాడు రాష్ట్ర తరహాలో మెషినరీ తయారీ విధానం ఏర్పాటు చేద్దాం అని చెప్పారు. ఇంకా ఈ గ్రామంలో మంచినీటి సమస్య, లో ఓల్టేజ్ సమస్య, తదితర సమస్యలు ఆయనకి విన్నవించారు. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సమస్యలు తప్పనిసరిగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జనసేన-తెలుగుదేశం-భారతియ జనతా పార్టీల రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు యువత, తెలుగు మహిళలు,అభిమానులు అందరూ పాల్గొన్నారు.