సమస్యలను పరిష్కరించాలి – స్పందనలో లోకం మాధవి గళం
నెల్లిమర్ల నియోజకవర్గం: నెల్లిమర్లలో పలు సమస్యలపై సోమవారం స్పందన కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి వినతులు సమర్పించారు. ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో పారిశుధ్యం చాలా అధ్వానంగా ఉంది ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో అకస్మాత్తుగా మా ఆరోగ్యాలు గుర్తొచ్చాయి ఆ ఒక్కసారి వచ్చి మా గ్రామాల్లోకి వచ్చి చూడండి తెలుస్తుంది మీరు వెలగబెట్టిన అనారోగ్య ఆంధ్రప్రదేశ్ నీ చుద్దురు గాని మాకు ఇంటికి ఒక డాక్టర్ కాదు అండి వీధికి ఒక కాలువలు కట్టించండి అని తన ఆవేదన వ్యక్తపరిచారు సమస్యలు తీర్చని కాడికి మీరు ఎందుకు ప్రభుత్వంలో ఉండడం కుర్చీ కాళీ చెయ్యండి ప్రజలు వస్తున్నారు అధికారంలోకి జనసేన పార్టీ ద్వారా నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్దే తన ధ్యేయం అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-09-at-5.37.11-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-09-at-5.37.11-PM-1-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-09-at-5.37.12-PM-1024x768.jpeg)