గుంటూరులో జనసేన-టీడీపీ ఆధ్వర్యంలో గుంతల రోడ్లపై నిరసన

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం: జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి సారథ్యంలో “గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది” అనే డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా ఏ.టి అగ్రహారం మెయిన్ రోడ్ (ఎస్.కే.బి.ఎం స్కూల్) యందు రోడ్ల రహదారుల, కాలువల దుస్థితిపై కార్యక్రమం చేసిన ఇరు పార్టీల సమన్వయ కర్తలు బొనబోయిన శ్రీనివాస్ యాదవ్, కోవెలమూడి రవీంద్ర నాథ్(నాని), జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, నక్కల వంశీ, శిఖా బాలు, శ్రీపతి భూషయ్య, బండారు రవి, 25, 29, 30,31 వార్డు అధ్యక్షులు దాసరి వెంకటేశ్వరరావు, పసుపులేటి నరసింహారావు, మధు లాల్, కదిరి సంజీవ్ మరియు ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.