రాజాం జనసేన-టిడిపి ఆధ్వర్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపెయిన్

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ & తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో భాగంగా, రాజాం-పాలకొండ మెయిన్ రోడ్డులో జనసేన పార్టీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జ్ ఎన్ని రాజు, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కొండ్రు మురళీమోహన్ పాల్గొని రోడ్డు యొక్క దుస్థితిని పరిశీలించి అనంతరం స్థానిక ప్రజలను గత నాలుగు సంవత్సరాలుగా ఈ రోడ్డు నిర్మాణం కాకపోవడం వలన జరుగుతున్న ప్రమాదాలు ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యూ.పి రాజు, రాజాం మండలం అధ్యక్షులు శివరాం, రేగిడి మండల అధ్యక్షులు శాసపు అప్పలనాయుడు, జనసైనికులు, కార్యకర్తలు వీరమహిళలు, తెలుగుదేశం నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.