ఉర్లాపు పోలరాజు ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్, బస్సు చార్జీలపై నిరసన ర్యాలీ

రాష్ట్ర ప్రభుత్వంపెంచిన విద్యుత్, బస్సు చార్జీలపై మరియు విద్యుత్ కోతలపై స్థానిక రాజాం అంబేద్కర్ జంక్షన్ వద్ద బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నియోజకవర్గం యువనాయకుడు ఉర్లాపు పోలరాజు (యు.పి.రాజు ) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా యు.పి.రాజు మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తానని చెప్పి ఈ రోజు అమాంతంగా విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నెత్తిన భారం మోపుతున్నారని, కరెంట్ కోతలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని.. తక్షణమే పెరిగిన విద్యుత్ ఛార్జీలు విద్యుత్ కోతలు మరియు ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామంతుల రమేష్, రెడ్డి బాలకృష్ణ, గొర్లె గోవింద్, అనుదీప్, శ్యామ్ మరియు తదితరులు పాల్గొన్నారు.