Chittoor: జనసేన కార్యకర్తలతో టీ.బీ.కే.జే.ఏ.సి దాసరి రాము ఆత్మీయ సమావేశం

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం బలిజ సంఘం సభ్యులతో మరియు శాంతిపురం మండలంలోని జనసేన & బిజెపి పార్టీ సభ్యులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీ.బీ.కే జాయింట్ యాక్షన్ కన్వీనర్ దాసరి రాము మాట్లాడుతూ
రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో జరిగిన స్థానిక ఎన్నికలలో జనసేన & బిజెపి అభ్యర్థులను బెదిరించటం, బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింప చేయించడం, అభ్యర్థులను డబ్బులతో ప్రలోభ పెట్టడం జరిగింది. అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు ఓటుకు మూడువేల నుండి పదివేల వరకు పరిస్థితులను బట్టి, ప్రాంతాలను బట్టి ఇచ్చారని తెలిసింది. ప్రజాస్వామ్యం ఎటు పోతున్నదో తెలియడం లేదని, ఇటువంటి ప్రలోభాలు మానుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన & బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.