గొల్లపేటలో ప్రజా చైతన్యపోరాటం

కాకినాడ సిటి: కాకినాడ జనసేన పార్టీ కార్యాలయంలో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో ముమ్మిడి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 38వ డివిజనులో గొల్లపేటలో ప్రజా చైతన్యపోరాటం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు స్థానిక ప్రజలతో కలసి ఆ ప్రాంతంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు కరెంట్ చార్జీలు భరించలేకపొతున్నామని వాపోయారు. శానిటేషన్ దారుణంగా ఉందన్నారు. పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తుఫానుకి ముంపు గురి అయినపుదు వెనకనున్న ఉప్పుటేరు వలన అది పొంగి చాలా నష్టాన్ని ఎదుర్కొంటున్నామనీ దీనికి బండ్ వాల్ కడతామంటారు. కానీ అది కార్యరూపం దాల్చటంలేదన్నారు. దీనిపై అందరం కలిసి పోరాడుదామనీ జనసేన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలియచేసారు. ఈ వై.సి.పి ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదనీ కొద్ది నెలలలో దీనికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బండి సుజాత, సోనీ ఫ్లోరెన్స్, మూర్త రమణమ్మ, ఉమా, బోడపాటి మరియా, మోర్తా మాలతి తదితరులు పాల్గొన్నారు.