ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి: రేఖగౌడ్

  • రాయలసీమ తిరుపతిలో జనవాణి
  • తిరుపతిలో జరిగే జనవాణి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రేఖ గౌడ్

ఎమ్మిగనూరు, రాయలసీమలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు 21వ తేదీన ఆదివారం రోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్వహించే జనవాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర మహిళ సాధికారిత ఛైర్మన్ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ పిలుపునిచ్చారు. సామాన్యుడి గళం ప్రభుత్వానికి వినిపించేలా రాయలసీమ జిల్లాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జనవాణి కార్యక్రమంలో పాల్గొని నేరుగా జనసేన పార్టీ అధినేతకు ఇస్తే ప్రజల వద్ద నుంచి వచ్చిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవడానికి జనసేన పార్టీ తరపున ప్రత్యేక యంత్రాంగం కృషిచేస్తుందని ప్రజలు ఈ నెల 21 వ తేది ఉదయం 10 గంటలలోపు తిరుపతిలో గల జి.ఆర్.ఆర్ కన్వెన్షన్ హల్ నందు హాజరై కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు, నందవరం మరియు గోనెగండ్ల మండలాల్లో ఏ విధమైన సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తమ దృష్టికి వచ్చిన సమస్యని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని తెలిపారు.