ఎక్స్ ఎంపీ పొంగులేటి చేతుల మీదుగా పుడమి సినిమా పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్: ఆర్. వి రెడ్డి బ్యానర్ లో నంద్యాల సాయి కళ్యాణ్ దర్శకత్వం వహించిన చిత్రం “పుడమి” సినిమా పోస్టర్ ఆవిష్కరణ శనివారం ఎక్స్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా జరిగినది. ఈ చిత్ర నిర్మాతలు ఆర్.వి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి రామిరెడ్డి. ఈ సందర్భంగా యువ దర్శకుడు నంద్యాల సాయి కళ్యాణ్ మాట్లాడుతూ.. కవులు, రైతుల నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా పూర్తి గ్రామీణ నేపధ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కొండపోలం ఫేమ్ కట్ట ఆంటోనీ, మైవిల్లేజ్ షో అంజిమామ, బాహుబలి ఫేమ్ ప్రమీల రాణి, సారపల్లి సతీష్, శుభోదయం సుబ్బరావు, దిల్ రమేష్, చాందిని రావు వీరితో పాటు నెల్లూరు కుర్రాళ్ళు మరియు లోకల్ నటులతో చిత్రాన్ని తీయడం జరిగింది. త్వరలొనే అధికారికంగా సినిమా కి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జూబ్లీహిల్స్ లోని షేడ్ స్టూడియోస్ లో పూర్తి చేసుకొని మరియు సినీమా ఓ.టి.టి లో వస్తుంది. ఈ కార్యక్రమంలో నంద్యాల సాయి కల్యాణ్, చింతమళ్ల నాగరాజు, పాల్గొన్నారు.