జనసేనలో చేరిన పులికల్లు, ఇట్లంపల్లి గ్రామాల యువత

కళ్యాణదుర్గం నియోజకవర్గం, జనసేన పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి లక్ష్మి నరసయ్య మరియు అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం మండల అధ్యక్షుడు షేక్ మొహిద్దిన్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి పులికల్లు, ఇట్లంపల్లి గ్రామాల్లో ఉన్న 20 మంది యువకులు పార్టీలోకి చేరడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జనసేన పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకు వెళ్లాలో, ప్రజాసమస్యలు గుర్తించి వాటి పరిష్కారం కృషి చేయాలని, యువతకు పెద్దపీట జనసేన పార్టీ వేస్తుందని యువత ద్వారానే సమాజంలో, రాజకీయాలలో అవినీతిని నియంత్రించగలమని వివరించడం ఈ సందర్భంగా నాయకులు పిలుపునివ్వటం జరిగింది. అలాగే కళ్యాణదుర్గం పట్టణ కమిటీల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం జనసేన నాయకులు రాజు, రమేష్, వంశీ, జగదీష్, ప్రతాప్, జాకీర్, సయ్యద్, శివ, ధనంజయ శ్రీనివాసులు, బ్రహ్మసముద్రం కన్వీనర్ ఆంజనేయులు, ఎర్రి స్వామి, మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.