హ్యాట్రిక్ సాధించిన పంజాబ్
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ హ్యాట్రిక్ విక్టరీసాధించిoది. క చ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అద్భుతంగా పోరాడింది. ఢిల్లీ క్యాపిటల్స్పై 5 వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ మరో 6 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాస్త టెన్షన్ పెట్టినా.. వరుసగా మూడో విజయం సొంతం చేసుకుంది.
ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ఢిల్లీ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్ను విజయవంతంగా ఛేదించింది. 8 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి చేరింది. రన్రేట్ను మెరుగుపర్చుకుంది.
నికోలస్ పూరన్ (53/ 28 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు), మాక్స్వెల్ (32/24 బంతుల్లో మూడు బౌండరీలు), క్రిస్గేల్ (29/ 13 బంతుల్లో మూడు బౌండరీలు , రెండు సిక్సర్లు) రాణించడంతో శిఖర్ ధావన్ (106/ 61 బంతుల్లో 12 బౌండరీలు, మూడు సిక్సర్లు) అద్భుత సెంచరీని వృథా అయింది.
వీరిద్దరూ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో సాధించాల్సిన రన్రేట్ వేగంగా తగ్గిపోయింది. దీంతో ఆఖర్లో వచ్చిన బ్యాట్స్మెన్ నిలకడగా ఆడుతూ టార్గెట్కు దగ్గరగా చేరుకున్నారు. మిడిల్ ఓవర్లో మాక్స్వెల్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో జట్టుకు విజయం ఈజీగా మారింది.