టోల్ ప్లాజా పెడితే సహించేది లేదు

  • అఖిలపక్ష సమావేశంలో జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు

నెల్లూరు నియోజకవర్గం: నెల్లూరు నగర నడిబొడ్డులో టోల్ ప్లాజా ఏర్పాటు చేసేందుకు పాలక పక్షం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుందని, టోల్ ప్లాజా ఏర్పాటు చేస్తే సహించబోమని జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు పేర్కొన్నారు. గురువారం సంతపేటలోని సిపిఐ కార్యాలయంలో దామ అంకయ్య సిపిఐ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే కావలి గౌరవరం వద్ద, వెంకటాచలం వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ రెండు చాలవు అన్నట్లుగా నెల్లూరు నడిబొడ్డులో మరో టోల్ ప్లాజాను ఏర్పాటు చేస్తామనడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికే ఈ టోల్ ప్లాజాను రెండుసార్లు వ్యతిరేకించినా పాలక పక్షంలో ఎటువంటి మార్పు లేకుండా మరోసారి టోల్ ప్లాజా ఏర్పాటు పనులు చేస్తున్నారన్నారు. వెంటనే టోల్ ప్లాజా నిర్మాణ పనులు ఆపివేయాలని, లేనిపక్షంలో జనసేన ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు నగర మేయర్ స్రవంతి తెలుగు దేశం నాయకులూ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, సిపిఐ(ఎం) నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసులు జనసేన నాయకులు ఆలియా, కంతర్, వినయ్, అలెక్, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *