జనసైనికుడు చందుకు అండగా జనసేన

వి.ఆర్.పురం మండలంలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై కాలు పూర్తిగా దెబ్బతిని రాజమండ్రిలో చికిత్స పొంది ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్న జనసైనికుడు పెట్ట చందుకు జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ అధ్వర్యంలో రాజుపేట కాలనీ వెళ్లి చందుకు 8,000 రూపాయలు ఆర్థిక సహాయం మరియు పండ్లు ఇవ్వడం జరిగింది. నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కుర్ల రాజశేఖర్ రెడ్డి మరియు జనసైనికుల సహకారంతో నగదు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు బాగుల ప్రమీల, ఉపాధ్యక్షులు కనుగుల శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి అంజనరావు, మండల ప్రధాన కార్యదర్శి కోట్ల రామ్మోహన్ రెడ్డి, యూత్ నాయకులుపవన్ కళ్యాణ్, ముంజపు సాయిరాం, జంగాల కిరణ్, కృష్ణ, పెట్ట నాగేంద్ర, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.