జనసైనికుడి కుటుంబానికి అండగా రాచమడుగు చందు, సుందర్ ల ఆర్థిక సహాయం

నంద్యాల, చాపిరేవుల గ్రామానికి చెందిన జనసేన క్రియశీలక కార్యకర్త సుబ్రహ్మణ్యం లివర్ సంబంధిత వ్యాధితో 15 రోజుల క్రితం మరణించడం జరిగింది. శనివారం జనసేన జిల్లా నాయకులు రాచమడుగు చందు, సుందర్ లు వారి కుటుంబానికి 12000/- రూపాయల ఆర్థిక సహాయం అందించి. వారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల, చాపిరేవుల, నందమూరి నగర్ జనసైనికులు పాల్గొన్నారు.