‘నా సేన కోసం నా వంతుకు’ రాహుల్ సాగర్ 30 వేల విరాళం

ఎమ్మిగనూరు, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా జనసేన పీఏసీ సభ్యులు నాగబాబును కలిసి ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమానికి 30 వేల రూపాయల విరాళాన్ని ఎమ్మిగనూరు జనసేన నాయకులు రాహుల్ సాగర్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ సాగర్, మాట్లాడుతూ చరిత్రలో ఫండింగ్ విషయంలో ప్రజల్ని భాగస్వామ్యం చేసిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని కొనియాడారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని ఒక్కసారి జనసేన పార్టీని ఆశీర్వదించి ప్రజా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని కోరారు.