దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన రాజమండ్రి జనసేన

రాజమండ్రి, జనసేన పార్తీ రాష్ట్రా నాయకులు శ్రీ యర్నాగుల శ్రీనివాస్ జన్మదినోత్సవం సందర్భంగా రాజమండ్రి జనసేన నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ అల్లాటి రాజు ఆధ్వర్యంలో వృధ్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించి, శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ యర్నాగుల శ్రీనివాస్ చేతుల మీదుగా నూతన సంవత్సర కేలండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ, సంయుక్త కార్యదర్శి శ్రీ వై వి డి ప్రసాద్, రాజమండ్రి సిటీ నాయకులు శ్రీ శ్యాం సుందర్ గుణ్ణం, ఫణి, రాజాజి నాయుడు, దుర్గాప్రసాద్, అజయ్, రాము, దుర్గా, ప్రదీప్, షన్ముఖ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.