అక్రమ అరెస్టులను ఖండించిన రాజంపేట జనసేన

  • అరెస్టు చేసిన జనసేన నాయకులను తక్షణమే విడుదల చేయాలి
  • జనసేన యువ నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు

రాజంపేట, జనసేన నాయకుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని రాజంపేట జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు పేర్కొన్నారు. రాజంపేట అసెంబ్లీ జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు రాజంపేట జనసేన ప్రధాన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జనసేన యువ నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ… విశాఖపట్నంలో “జనవానణి” కార్యక్రమంలో భాగంగా ప్రజల కష్టాలను, సమస్యలను తెలుసుకోవడానికి వచ్చిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన సందోహం చూసి వైయస్సార్ పార్టీ నాయకులు ఉలిక్కిపడి జీర్ణించుకోలేక అక్రమ కేసులు బనాయించి జనసేన నాయకులను, జనసైనికులను అరెస్టు చేయడం చాలా దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం కొత్త కొత్త డ్రామాలు కోడి కత్తి డ్రామాలు మాదిరిగా మరో డ్రామాకు తెరలేపారన్నారు. త్వరలో ప్రజలే వైసిపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఖాయం అన్నారు. శనివారం వైజాగ్ లో జరిగిన వైసీపీ గర్జన విఫలం కావడం అక్కడి ప్రజలు పవన్ కళ్యాణ్ కు బ్రహ్మరథం పట్టడంతో ఆభయం మరింత ఎక్కువైందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలను ప్రజలందరూ, అర్థం చేసుకుంటున్నారని, ఈ దుర్మార్గ ప్రభుత్వానికి అంతం ఎంతో దూరంలో లేదన్నారు. ఏక్షణాల్లోనైనా ఎన్నికలు జరిగినా కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని, ప్రతి ఒక్కరికి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తామని రాజంపేట జనసేన పార్టీ తరఫున ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీరయ్య ఆచారి జనసేన వీర మహిళ జెడ్డా శిరీష, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.