కౌలు రైతు భరోసా యాత్రకు రాజంపేట, రైల్వే కోడురు కువైట్ జనసైనికుల విరాళం

రాజంపేట నియోజకవర్గం:  ఎక్కడ ఆపద వున్నా ఎవరికి సాయం చేయాలన్నా ముందుండే ప్రజ నాయకుడు పవన్ కళ్యాణ్. మనకు అన్నం పెట్టే రైతన్నలకు ఆపద వస్తే చూస్తూ ఊరుకుంటారా, ఎంతో ఖర్చు చేసి రైతులు పంట పండిస్తే చేతికి వచ్చే సమయానికి ప్రకృతి విపత్తుల వల్ల, ఒకవేళ పండిన పంటకు గిట్టు బాటు ధరలు లేకపోవడం వల్ల రైతన్న అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోయిన కౌలు రైతన్నల కుటుంబాలను ఆదుకుంటూ ఒక్కో కుంటుంబానికి లక్ష రూపాయల చెక్కును పవన్ కళ్యాణ్ అందిస్తున్న విషయం అందరికి తెలిసింది. ఈ మహాయజ్ఞానికి ఉడుత సహాయం చెయ్యలని తలచిన కువైట్ లో వున్న జనసైనికుడు కొట్టే శ్రీహరి తనతోటి రాజంపేట, రైల్వే కోడురు నియోజకవర్గ‌ జనసైనికులు దర్గాం హరి, షేక్ జీలాని, కొత్తూరు మల్లికార్జున రెడ్డి (మాధవరం1 సిధ్ధవటం), బల్లేపల్లి శ్రీనువాసులు, ఉర్లగుంట శ్రీహరి, గుగ్గిళ్ళ నాగార్జున, సోమిశెట్టి శంకర్, పసుపులేటి పెంచలయ్య, అబ్బనగారి రాజ, అబ్ధుల్ మాలిక్, శెట్టిపల్లె వెంకట్ ప్రసాద్, శివ కృష్ణ రాయల్, అబ్బాస్, సునిల్ శెట్టి, ఆకుల శివ, ఆరెం సుబ్బయ్య, గురక శివప్రసాద్, పుల్లంపేట నరేష్&శివ, గుంటూర్ శంకర్, ఆనందాల మల్లి, శ్రీనాథ్, వినోద్ ల ద్వారా రు.1,10,116/- లను సేకరించడం జరిగింది. ఈ డబ్బును చెక్ రూపంలో పవన్ కళ్యాణ్ గారికి శనివారం నందలూరు జనసైనికుడు కొట్టే హరిష్ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో అందించడం జరిగింది.