విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు డిజిటల్ క్యాంపెయిన్ లో ప్లకార్డులతో నిరసన తెలిపిన రాజంపేట జనసేన

రాజంపేట నియోజకవర్గం, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శనివారం రాజంపేట పట్టణంలోని బంగ్లా దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన ప్లకార్డులు ప్రదర్శించి చేయడం జరిగింది విశాఖ ఉక్కు ను సాధించడంలో ఎంతోమంది శ్రమకోర్చ, అనేక ఇబ్బందులు ఎదుర్కొని 32 మంది ప్రాణాలు వదిలి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు ఆత్మ గౌరవం ఆంధ్రుల ఆత్మ ఈ విశాఖ ప్రైవేటీకరించడం ఆంధ్రులను అవమానపరచడమే, కార్మికుల నోరు కొట్టడం, నిరాశ్రయులైన వారిని నట్టేట ముంచటమే అవుతుంది. కేవలం నష్టాల పేరుతో విశాఖ ఉక్కు ను ప్రైవేటీకరణ ఇస్తామంటే, ఆంధ్ర ప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయి సామాన్యుడు బతకలేని స్థితి లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ని కూడా ప్రైవేటీకరిస్తారా? చెప్పండి. విశాఖ ఉక్కు కు సొంత గనులు ఉంటే వేలకోట్ల లాభాల్లో నడిచేది. కేవలం ఈ మూడేళ్లలో పెరిగిన ధరల కారణంగా నష్టాలు చవి చూసి ఉండొచ్చు కానీ 2021లో 320 కోట్ల లాభాలతో ఉంది అంటే విశాఖ ఉక్కు నష్టాల దారిలో నడిచే ది కాదని శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం అదేవిధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ముఖ్యంగా శ్రీ నరేంద్ర మోడీ తెలుసుకోవాలని కోరుతున్నాం. విశాఖ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి బ్రదర్ నమస్తే ప్రెస్ మీట్ కి నిరసన తెలియజేసిన ప్లకార్డులు ప్రదర్శించి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ ఆపాలనికోరుకుంటూ… ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి రటల రామయ్య, లీగల్ సెల్ కత్తి సుబ్బారాయుడు, ఆకుల నర్సయ్య, బండ్ల రాజేష్, నంద్యాల హరి గురువు గారి వాసు, మేకల గోపి తలపాక శంకరయ్య, పోలిశెట్టి శ్రీను, మలిశెట్టి మనోజ్ మరియి ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.