మాట తప్పి, దీక్షకు దిగితే ప్రజలు నమ్ముతారా కాసు మహేష్ రెడ్డి గారు? : గాదె

పిడుగురాళ్ల, మాట తప్పం మడమ తిప్పం అంటూ ప్రగల్బాలు పలికి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలు చేస్తే గురజాల నియోజవర్గంలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? అరునెలల్లో బైపాస్ పూర్తి చేస్తానని ఉత్తర కుమార మాటలు మాట్లాడి ఈరోజు దొంగ దీక్షలకు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దిగారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. దశాబ్దకాలంగా పూర్తి చేయలేని పిడుగురాళ్ల బైపాస్ ను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పూర్తి చేస్తానని ప్రజలను నమ్మించి 45 నెలలు గడుస్తున్నా కూడా హైవే పూర్తి చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఎమ్మెల్యే ఉన్నారని గాదె దుయ్యబట్టారు. మాట్లాడితే తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం కాదని ప్రజా సమస్యలను తీర్చే విషయంలో చిత్తశుద్ధి ఉండాలని అన్నారు. ఎక్కడైనా అధికార పార్టీ నిరాహారదీక్ష చేస్తుందా? అని గాదె ప్రశ్నించారు.. అధికారంలో ఉంది మీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్థానంలో ఉంది మీ జగన్మోహన్ రెడ్డి. రోజుకో బటన్ నొక్కే జగన్మోహన్ రెడ్డి పిడుగురాళ్ల బైపాస్ కు ఎందుకు నిధుల బటన్ నొక్కడం లేదని దుయ్యబట్టారు. ప్రతి శనివారం ఆదివారం వచ్చి ఆదాయ లెక్కలు చూసుకుని సూట్కేసులు నింపుకొవడం పై ఉన్న శ్రద్ధ బైపాస్ విషయంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి ఎందుకు లేదని అన్నారు. బైపాస్ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని జనసేన నాయకులతో కలిసి పర్యటించిన గాదె మరో ఆరునెలలు సమయం యిచ్చిన పూర్తి చేయలేరని అన్నారు.. మేము వచ్చే లోపే దీక్ష విరమించి ఎమ్మెల్యే వెళ్లాడని, కాబట్టి ఇదంతా కూడా తూతూ మంత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాశిం సైదా, ఉపాధ్యాక్షులు పెదకొలిమి కిరణ్, ప్రధాన కార్యదర్శి గుర్రం కోటేశ్వరరావు, షేక్ మదీనా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు సలీమ్, రామాయణం రాము, బేతంచర్ల ప్రసాద్, జానపాడు గ్రామధ్యక్షుడు పసుపులేటి నరసింహరావు, ప్రధాన కార్యదర్శి అంబటి సాయి ఇతర నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.